పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా జనసేన మానవ హారం..!

By Ravi
On
పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సంతాపంగా జనసేన మానవ హారం..!

ch.శేఖర్‌ tpn, తిరుపతి :

జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరి వారి మండపం దగ్గర నుంచి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వినుత కోటా, జనసైనికులు, వీర మహిళలతో కలిసి మానవ హారం నిర్వహించి సంతాపం తెలిపారు.ఈ సంద్భర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాదుల అత్యంత పాశవిక దాడిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పూర్తిగా సహకరిస్తారని, ఇలాంటి చర్యలు జరిగిన రోజు బ్లాక్ డే అని తెలిపారు. మృతుల పట్ల పవన్ కళ్యాణ్ చాలా బాధతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల ఆత్మకి శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేట చంద్రశేఖర్, తోట గణేష్, చిన్నతోటి నాగరాజు, భాగ్యలక్ష్మి, కొట్టిడి మదు శేఖర్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, నితీష్, రాజ్య లక్ష్మి, జ్యోతీ రామ్, రమేష్ రెడ్డి, రిటైర్డ్ ఎమ్మార్వో చంద్ర శేఖర్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Latest News

ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. ఇరాన్ పోర్టులో భారీ పేలుడు..
ఇరాన్‌ లోని బంద‌ర్ అబ్బాస్ న‌గ‌రంలో ఉన్న షాహిద్ రాజాయి పోర్టులో నేడు భారీ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ఆ దుర్ఘ‌ట‌న‌లో 47 మంది గాయ‌ప‌డ్డారు. ఒమ్మాన్‌లో...
ట్రంప్‌, జెలెన్‌ స్కీ ల మధ్య భేటీ.. 
పాకిస్థాన్ రెడీగా ఉంది: పాక్ ప్రధాని
రాహుల్‌ గాంధీకి కోర్టు సమన్లు..
గుజరాత్‌లో భారీగా అక్రమ వలసదారులు..
పాకిస్తాన్ ఆర్మీలో టెన్షన్..
ధోనిపై సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..