అల్లు అర్జున్, అట్లీ మూవీ కోసం ముగ్గురు హీరోయిన్లు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేయబోతున్నట్లు రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాగా హెవీ వీఎఫ్ఎక్స్ వర్క్స్తో రూపొందించబోతున్నారు. ఈ సినిమా నెవర్ బిఫోర్ కథగా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయ్యిందట. ఇప్పటికే ఆమె ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా చేసినట్లు సినీ వర్గాల టాక్.
అల్లు అర్జున్తో మృణాల్ ప్రెష్ పెయిర్గా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్గా జాన్వీ కపూర్ కూడా యాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉండనుందట. ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందని ఫిల్మ్ యూనిట్ భావిస్తోంది. అంతేగాక, అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ తన కెరీర్లో డబుల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.