సిటీలో పలుచోట్ల ఎక్సైజ్ ఎస్టిఎఫ్ డి టీమ్స్ దాడులు.. 5.260కేజీల గంజాయి స్వాధీనం

By Ravi
On
సిటీలో పలుచోట్ల ఎక్సైజ్ ఎస్టిఎఫ్ డి టీమ్స్ దాడులు.. 5.260కేజీల గంజాయి స్వాధీనం

ఎక్సైజ్ అధికారులు రెండు కేసుల్లో 5.260 కేజీల గంజాయి స్వాదీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడమే కాకుండా  కారు, సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ డిటిఎఫ్, ఎస్టిఎఫ్డి టీమ్‌ల ఎక్సైజ్‌ సిబ్బంది నిర్మల్‌ ప్రాంతానికి చెందిన మలావత్‌ రాజేందర్‌, ఇండాల్‌ రాథోడ్‌లు కలిసి 4.140 కేజీల గంజాయిని కారులో తీసుకొని వచ్చి హైదారాబాద్‌  లో అమ్మకాలు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌ శివారు ప్రాంతాల నుంచి  గంజాయిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కొందరు వ్యక్తులకు  అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంతున్నట్లు దర్యాప్తులో తేలింది.

IMG-20250423-WA0114మరో కేసులో..
కొండాపూర్‌ బొటానికిల్‌ పార్కు సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టి ఎఫ్డీ టీమ్‌ ఎస్సై  జ్యోతి టీం  దాడి నిర్వహించారు.
ఈ కేసులో వెస్టు బెంగాల్‌కు చెందిన నారాయణ చౌదారి అనే వ్యక్తి  అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఒక సెల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు నిందితుడిని షేర్‌ లింగంపల్లి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో  అప్పగించారు. గంజాయిని పట్టుకున్న కేసులో ఎస్సై జోతితోపాటు హెడ్‌కానిస్టేబుల్‌  లేఖా సింగ్‌, కానిస్టేబుళ్లు రాజేశ్వర్‌, చంద్రశేఖర్‌,కాశీరావు, శశిలు  ఉన్నారు.

Tags:

Advertisement

Latest News

మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు.  మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో...
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం