ఘ‌నంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు 

By Ravi
On
ఘ‌నంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు 

రంగారెడ్డి /రాజేంద్రనగర్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో సిబిఎన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను టీఎన్జీవోస్ జీహెచ్ఎంసీ పార్క్‌ లో నిర్వహించారు. దీనిలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు తమ దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్ర అభివృద్ధికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారన్నారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రైతుల సంక్షేమం వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి మరపురానిదని తెలిపారు. యువతకు మార్గదర్శకుడిగా ఆయన ప్రేరణగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ వేడుకలో బండారి యాదగిరి కాశీగారి యాదగిరి, యంజాల మహేష్ రాజు, ఏర్వ సత్యనారాయణ, తిరుమల వెంకటేష్, కుంకుల్లా దత్తు, శివ, నారాయణ, బాస శ్రీనివాస్, మహిపాల్, సీతారాం పాండు, గట్టయ్య, శేఖర్ గౌడ్, కొండల్, మహేందర్, ప్రభాకర్ గౌడ్, సంతోష్ గౌడ్, మధు, మునిగిపాటి వెంకటేష్, స్వామి గౌడ్, దేవేందర్, వడిగాచర్ల మల్లేష్, శరణమ్మ, పుష్ప, గౌతమి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..