కాశ్మీర్‌ పై పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

By Ravi
On
కాశ్మీర్‌ పై పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

ఇండియాపై పాకిస్తాన్ కు మొదట్నుండి సరైన అభిప్రాయం లేదు. మరోసారి ఆ దేశం ఇండియాపై అక్కసు వెళ్లగక్కింది. కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి స్పీచ్ ఇస్తూ.. అసిమ్ మునీర్ కాశ్మీర్ టాపిక్ ను హైలెట్ చేశారు. కాశ్మీర్ తమ జీవనాడి అని, దాన్ని మర్చిపోలేమని కామెంట్ చేశారు. విదేశాల్లో ఉన్నవారంతా దేశ రాయబారులు అని, ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందిన వారు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. 

అంతేకాకుండా మీ పిల్లలకు సైతం మన దేశ చరిత్రను, గొప్పతనాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయాలని, హిందువులతో పోల్చుకుంటే, మనం చాలా భిన్నమైన వారమని వారికి ఖచ్చితంగా బోధించాలని అన్నారు. ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం అని ఈ సంధర్భంగా అన్నారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఈ విషయాలు మీ పిల్లలకు తెలియజేయాలన్నారు. కాగా ఈ విషయంపై పలువురు మండిపడుతున్నారు. పిల్లల్లో ఇంకా దేశాల మధ్య బేధాన్ని నూరి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!