సెల్‌ఫోన్స్‌ చోరీ ముఠాలు అరెస్ట్‌

By Ravi
On
సెల్‌ఫోన్స్‌ చోరీ ముఠాలు అరెస్ట్‌

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, శంషాబాద్, బాలానగర్, మేడ్చల్ జోన్లలో చోరీలకు పాల్పడ్డ దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాలుగు జోన్ల పరిధిలో మొత్తం 1060 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లతోపాటు ఒంటరిగా వెళుతున్న వారిని టార్గెట్‌గా చేసుకొని సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్స్‌ను సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఎల్‌సీ నాయక్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం ఐదు టీమ్స్‌ పగలు, రాత్రి కష్టపడి సెల్‌ఫోన్‌లను రికవరీ చేశారని చెప్పారు. ఫోన్ పోగొట్టుకున్న బాధ బాధితులకు మాత్రమే తెలుస్తుందన్నారు. ఎన్నో కుటుంబాలు సెల్‌ఫోన్ పోగొట్టుకొని నలిగిపోతున్నాయని.. సెల్‌ఫోన్ పోతే ఎలా రిపోర్ట్ చేయాలో కూడా ఎవరికి తెలియడం లేదన్నారు. సీఈఐఆర్ పోర్టల్‌ను కేంద్రం ఆధునీకరించిందని చెప్పారు. ఇప్పటి వరకు 9505 ఫోన్‌లను అన్ బ్లాక్ చేశామని.. 3 కోట్ల 18 లక్షల రూపాయల విలువైన సెల్‌ఫోన్‌లను రీకవరీ చేశామన్నారు. నిత్యావసర వస్తువులలో సెల్‌ఫోన్ ఒకటిగా మారిపోయిందని.. కాబట్టి సెల్‌ఫోన్‌లను జాగ్రత్తగా చూసుకోవాలి సూచించారు.

Advertisement

Latest News

ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్ ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్
ఎక్సైజ్ శాఖలో  కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగా ఉందని  కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం...
నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మల్
మిస్ వరల్డ్ 2025 కార్యక్రమంపై సైబరాబాద్ కమిషనరేట్ లో భద్రతా సమన్వయ సమావేశం
పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!
సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు
భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!
స్పేస్ లో చేపల పెంపకం..