జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా బాలపూర్ చౌరస్తాలో ఘనంగా పలువురు నివాళులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బాలికల విద్య కోసం పెద్దపీట వేశారని అందుకె ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని చదివించి ఒక స్ఫూర్తిగా నిలబడ్డాడని చెప్పారు.అదే స్ఫూర్తిని కేసీఆర్ కొనసాగించి బాలికల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆమె అన్నారు. భారతదేశంలో చదువులో అమ్మాయిల సంఖ్యనే ఎక్కువగా ఉందని అందుకు పాఠశాల నుంచి మొదలుకొని యూనివర్సిటీల వరకు అమ్మాయిలే చదువును కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు. అలా చదువుకోవడం వల్లనే మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని ఆమె అన్నారు. మహనీయుల విగ్రహాలకు దండ వేసి దండం పెట్టడం కాదు వారి ఆశయాలను కొనసాగించాలని ఆమె కోరారు.