వారం రోజులే మీకు టైం.

By Ravi
On
వారం రోజులే మీకు టైం.

వాటర్ వర్క్స్ అధికారులకు ఎమ్మెల్యే సబిత వార్నింగ్

వాటర్ వర్క్స్ అధికారులకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్కేపురం, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. గత వారం రోజులుగా మంచినీరు రావడం లేదని ఓ మహిళ కంట తడిపెట్టుకుంది. దీనికి చలించిపోయిన ఎమ్మెల్యే వాటర్ వర్క్స్ అధికారులపై మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరు మంచినీరు, కరెంట్ సమస్యలతో బాధపడలేదని, కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదన్నారు. సీఎం కి HCU భూములపై ఉన్న ప్రేమ జనాల సమస్యలపై లేదని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

 

Related Posts

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!