ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!

By Ravi
On
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!

హైదరాబాద్‌ TPN: 

జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలాజీ లే అవుట్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న తేజ అనే 30 ఏళ్ల మహిళ.. తన ఇద్దరు కుమారులను కొబ్బరిబోండాల కత్తితో నరకగా.. 11 ఏళ్ల హర్షిత్‌ అక్కడికక్కడే చనిపోయాడు. 8 ఏళ్ల ఆశిష్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరు కుమారులపై కత్తితో దాడిచేసిన తేజ.. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు తేజ మానసిక పరిస్థితి కూడా బాగోలేకపోవడం కూడా మరో కారణమని తెలుస్తోంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Latest News

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..! అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
హైదరాబాద్‌ వనస్థలిపురంలో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. స్థానిక ఇంజాపూరంలో రోడ్డును ఆక్రమించుకొని చేసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. స్థానికంగా స్కూప్స్ ఐస్‌క్రీమ్ కంపెనీ యాజమాన్యం కాలనీ...
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!