26.7 కేజీల గంజాయి పట్టివేత..!

By Ravi
On
26.7 కేజీల గంజాయి పట్టివేత..!

హైదరాబాద్‌ TPN

హైదరాబాద్‌ ధూల్‌పేట్‌లో అక్రమంగా దిగుమతి చేసుకున్న 25.2 కేజీల గంజాయిని ఎస్టీఎఫ్ఏ టీమ్‌ పట్టుకున్నారు. ఇదే టీమ్‌ మరో 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసి.. తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. మొత్తంగా పట్టుకున్న 26.7 గంజాయి విలువ రూ. 13.50 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ధూల్‌పేటలో రాణి అవంతిబాయి విగ్రహం సమీపంలో.. ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకున్న గంజాయిని తీసుకువెళుతున్న అకాష్‌సింగ్‌ను ఎస్టీఎఫ్‌ఏ టీమ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న లఖన్‌సింగ్‌, సంజయ్‌సింగ్‌, జ్యోతి బాయ్‌, అనంద్‌సింగ్‌, మణిష్‌ సింగ్‌, దీప, నిరంజన్‌ కుమార్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్‌ఏ టీమ్‌ లీడర్‌ అంజిరెడ్డి తెలిపారు. ఇక జియాగూడ పీలా కాశీ శివమందిర్‌ సమీపంలో గంజాయిని అమ్మకాలు జరుపుతున్న భద్రినారాయణ్‌ సింగ్‌ను ఎస్టీఎఫ్‌ఏ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బంగ్లా వాలా అజయ్‌సింగ్‌, మంజు దేవిలకు సంబంధం ఉండడంతో వారిపై కూడ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!