సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!

By Ravi
On
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!

హైదరాబాద్ TPN :

మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో సాయిసూర్య డెవలపర్స్ డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. ప్లాట్‌ల విక్రయాల పేరుతో రూ.100 కోట్లకు పైగా సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థ డిపాజిట్లు సేకరించింది. సోదాల్లో రూ.74.50 లక్షలు ఈడీ స్వాధీనం చేసుకుంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. సతీష్ చంద్రగుప్త , నరేంద్ర సురానా నివాసాలపై సోదాలు జరిపిన ఈడీ.. ప్లాట్‌ల విక్రయాల పేరుతో ముందుగానే చెల్లింపులు రాబట్టిన సాయి సూర్య డెవలపర్స్.. ఒకే ప్లాట్‌ను వివిధ వ్యక్తులకు అమ్మకాలు చేసినట్లు విచారణలో తేలింది. ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండానే భూముల విక్రయాలు జరిపినట్లు వెల్లడైంది.

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!