తుర్కంజాల్ మున్సిపాలిటీ పరిధి శివాజీనగర్ లో తీవ్ర ఉద్రిక్తత .

By Ravi
On
 తుర్కంజాల్ మున్సిపాలిటీ పరిధి శివాజీనగర్ లో తీవ్ర ఉద్రిక్తత .

ఇబ్రహీంపట్నం తుర్కంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య విభేదాలు చెలరేగి రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. శివాజీ నగర్ ఫేస్ 2 240, 241, 242 లో గల ప్లాట్లను1984లో దాదాపు 400 మంది కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో కొందరు బయటి వ్యక్తులు ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవని అవి తమ భూములంటూ ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. దీని విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. తెల్లవారుజామున కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేయగా ప్లాట్స్ యజమానులు అడ్డుకున్నారు. ఇరువురు మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీయడంతో రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!