పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..
మమతా బెనర్జీ సర్కార్ కు కలకత్తా హైకోర్టు భారీ ఊరట కలిగించింది. 2022 లో స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ రిక్రూట్ మెంట్ కోసం ఎక్స్ ట్రా పోస్టుల క్రియేషన్ పై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నేడు రద్దు చేయాలని పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, పశ్చిమ బెంగాల్ లోని విద్యాశాఖ పలు సంప్రదింపులతో పాటు గవర్నర్ నిర్ణయంతో మాత్రమే రిక్రూట్ మెంట్ కు సంబంధించి అదనపు పోస్టులు క్రియేట్ చేసినందుకు న్యాయమైన జోక్యం అవసరం లేదని అన్నారు.
అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ రిక్రూట్ మెంట్ కోసం అదనపు పోస్టులు వేయడం అనేది చట్టబద్ధం కాదని కోల్ కతా హైకోర్టు తెలిపింది. అయితే ఈ కీలక నిర్ణయానికి సంబంధించి ప్రశ్చించేందుకు మంత్రివర్గ సభ్యుల్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది. కాగా సీబీఐ దర్యాప్తుకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసినట్లు తెలుస్తుంది.