వక్ఫ్ సవరణ చట్టానికి ఎమర్జన్సీ విచారణ అక్కర్లేదు: సుప్రీం
ప్రస్తుతం వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చట్టంలో సవరణలు అమల్లోకి తీసుకురావడంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ క్రమంలో ఈ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడాన్ని వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అంతేకాకుండా ఈ పిటిషన్లను ఎమర్జెన్సీ గా లిస్ట్ చేయాలని ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
అయితే వక్ఫ్ సవరణ చట్టం 2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు నేడు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని నోటిఫై చేసినప్పటి నుంచి వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయని సుప్రీంకోర్టు పేర్కోంది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది. మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది.. దానికి అనుకూలంగా ముందుకు వెళ్లాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కి సీజేఐ సూచించారు. కాగా, ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేది దేశ రాజ్యాంగంపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా దేశంలో ఈ బిల్లు ముస్లింల మత స్వేచ్ఛపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వెల్లడించారు.