టీచర్ రిక్రూట్ మెంట్ రద్దుపై మమతా బెనర్జీ వ్యాఖ్యలు..
వెస్ట్ బెంగాల్లో 25 వేల మంది టీచర్ల రిక్రూట్మెంట్ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు నియామక టీచర్లతో సీఎం మమతా బెనర్జీ మీటింగ్ లో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తాను బ్రతికున్నంత వరకు ఉద్యోగాలు కోల్పోలేరని అన్నారు. టీచర్ రిక్రూట్ మెంట్ రద్దు వార్త వినగానే.. విషాదంతో తన గుండె రాయిలా మారిందని, తాను మాట్లాడిన తీరు పట్ల తనను జైలులో వేసే అవకాశం ఉందని, ఎవరైనా తనకు సవాల్ విసిరితే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అని మమతా బెనర్జీ అన్నారు.
అదే విధంగా తాను తన ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని అన్నారు. అందుకే అర్హులైన వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు చేజారకుండా చూస్తానని మమతా హామీ ఇచ్చారు. కాగా బెంగాల్ ప్రభుత్వం తాజాగా 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బందిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తిగా లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఈ నియామకాలు అన్నీ సఫలీకృతం కావని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ ను రానున్న మూడు నెలల కాలంలో కొత్త నియామక ప్రక్రియను చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.