బెట్టింగ్‌ భూతానికి మరో యువకుడు బలి..!

By Ravi
On
బెట్టింగ్‌ భూతానికి మరో యువకుడు బలి..!

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక సుచిత్ర బీహెచ్ఈఎల్ క్వార్టర్స్‌లో ఉండే  రాజ్వీర్ సింగ్ ఠాకూర్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడని రైల్వే పోలీసులు తెలిపారు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మ, చిన్నాన్న వద్ద ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. కొంత కాలంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి మద్యానికి బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎక్కువ అవడంతో మనస్థాపానికి గురై తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైల్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!