సనత్ నగర్ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

By Ravi
On
సనత్ నగర్ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌: సనత్‌నగర్ పీఎస్ పరిధిలో జరిగిన సంచలనాత్మక మహిళ హత్య కేసును బాలానగర్ DCP సురేష్ కుమార్ శుక్రవారం ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

ఈ నెల 26 న రాత్రి 10:50 గంటలకు భరత్ నగర్ బ్రిడ్జి సమీపంలోని చికెన్ షాప్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ నగ్నంగా చనిపోయినట్లు షేక్ నయీమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు, ప్రాథమిక దర్యాప్తులో ఆమె 55 సంవత్సరాల మహిళగా గుర్తించారు.

సీసీ కెమరా విజ్యువల్స్ ఆధారంగా, పోలీసులు నిందితుని జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన కొమ్మరాజు కనకరాజు @ రాజు అని గుర్తించి, ఈరోజు ఉదయం బాలానగర్ శోభన బస్ స్టాప్ దగ్గర అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో బాలానగర్ పరిధిలో దొంగతనం కేసులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించిన పాత నేరస్థుడిగా ఉన్నాడు.

పోలీసుల విచారణలో, ఇద్దరూ లైంగిక సంబంధం పెట్టుకున్నారని, ఆ సమయంలో మహిళ కేకలు వేయడంతో ఆమెను చంపడానికి పిడికిలితో దెబ్బలు వేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

బాలానగర్ DCP సురేష్ కుమార్, కేసు 103(1) బిఎన్‌ఎస్‌ సెక్షన్ కింద నమోదు చేసి నిందితుని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. మహిళను గుర్తించడానికి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!