శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!

By Ravi
On
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!

శేఖర్‌, తిరుపతి TPN : శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్‌గా మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో చర్చించి నియామకాన్ని ఖరారు చేశారు. మీడియాకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేలా బాధ్యతలు అప్పగించారు. సౌమ్యుడు, వివాదారహితుడు తెలుగు యువత పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం నేపథ్యంలో.. మీడియా మిత్రులతో సన్నిహిత సంబంధాలు ఈ పదవి రావడానికి కారణమయ్యాయి. మీడియా కోఆర్డినేటర్‌గా ఎన్నికైన దుర్గాప్రసాద్‌ను శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పలువురు ఘనంగా సత్కరించారు. అనంతరం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఎమ్మెల్యే కార్యక్రమానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తానని తెలిపారు. అలాగే విలేకరుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని.. పాత్రికేయల అభివృద్ధికి, సంక్షేమానికి సాయం చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే అప్పగించిన ఈ బాధ్యతలను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు