66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా విడుదల

◉ గతంలో 103 మందికి రూ.5.15 కోట్లు చెల్లింపు

By Ravi
On
66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా విడుదల

  • 66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా

  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో 169 మందికి రూ.8.45 కోట్లు చెల్లింపులు

  • 103 మందికి రూ.5.15 కోట్లు చెల్లింపులు గతంలో

  • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై అనిల్ ఈరవత్రి, కె. రామకృష్ణా రావు సమన్వయంతో నిధుల విడుదల.

WhatsApp Image 2025-03-28 at 3.58.12 PMనవంబర్ 3, 2023: ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, 66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా (ఆర్ధిక సహాయం) విడుదల చేయబడ్డట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు **మాజీ ఎమ్మెల్యే ** అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా సొమ్మును శుక్రవారం వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు.

సీఎం ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ప్రణాళిక) కె. రామకృష్ణా రావుతో సమన్వయంతో నిధులు విడుదల చేయించినట్లు అనిల్ వివరించారు.

నిబంధన ప్రకారం, ఈ మొత్తాన్ని నిజామాబాద్ (28), జగిత్యాల (19), కామారెడ్డి (9), నిర్మల్ (7), మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల వారసులకు అందజేయబడింది.

గతంలో 103 మంది గల్ఫ్ మృతుల కోసం రూ.5.15 కోట్ల ఎక్స్ గ్రేషియా విడుదల చేసినట్లు తెలిపారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో 169 మందికి రూ.8.45 కోట్లు ఎక్స్ గ్రేషియా చెల్లింపులు పూర్తి చేయబడ్డాయి అని అనిల్ ఈరవత్రి వెల్లడించారు.

 

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!