బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
-
ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరగనుంది, మహాకుంభమేళ తరహాలో సభ నిర్వహిస్తామన్నారు.
-
25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
-
శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుగా పనిచేసింది, అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినట్లు చెప్పారు.
-
ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సభలో నిరసనలు తెలిపామని, ముఖ్యమంత్రి ఫీజు రీయింబర్స్ మెంట్పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను కూడా కొనియాడారు.
-
బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదం పొందినట్లు తెలిపారు.
హైదరాబాద్, 28/03/2025
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న కవిత, రాష్ట్ర అప్పుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"కాంగ్రెస్ నేతలు అపభ్రంశాలు చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అప్పులు రూ. 4 లక్షల 42 వేల కోట్లు అని ప్రకటించింది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రూ. 8 లక్షల కోట్లు అప్పులుగా చెబుతున్నారు. ఇది దష్ప్రచారం" అని అన్నారు.
అప్పుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్దాలను కవిత తప్పుపట్టారు. "అబద్దాలు చెప్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలి" అని ఆమె మండిపడ్డారు.
కవిత, కాళేశ్వరం బ్యారేజీ కూలిపోతుందని చెబుతున్న దుష్ప్రచారం కూడా అవాస్తవంగా తేలిందని చెప్పారు. "ఇరిగేషన్ మంత్రి స్వయంగా చెప్పిన ప్రకారం, కాళేశ్వరం బ్యారేజీలపై వాస్తవం లేదు" అని ఆమె పేర్కొన్నారు.
అలాగే, "నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కాదా?" అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సాక్షిగా మహిళలకు పరుషపదజాలంతో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చరిత్రలో నల్లమరకగా ఉండిపోతాయని కవిత అన్నారు.