కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలో అక్రమ మట్టి వ్యాపారం
By Ravi
On
కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలోని బాసినపాడు, ముంజులూరు, మణిమేశ్వరం గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధించి స్థానిక అధికారులు ఎటు వైపు కన్నెత్తి చూడటం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మట్టి వ్యాపారులు, అధికారులు, రాజకీయ నాయకుల సహకారంతో తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు అని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో, బంటుమిల్లి ఇన్చార్జి తహసిల్దార్ కాగిత పూర్ణచంద్రరావు వివరణ ఇచ్చారు. ఆయన మండల పరిధిలో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Tags:
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...