కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలో అక్రమ మట్టి వ్యాపారం

By Ravi
On
కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలో అక్రమ మట్టి వ్యాపారం

కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలోని బాసినపాడు, ముంజులూరు, మణిమేశ్వరం గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధించి స్థానిక అధికారులు ఎటు వైపు కన్నెత్తి చూడటం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మట్టి వ్యాపారులు, అధికారులు, రాజకీయ నాయకుల సహకారంతో తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు అని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో, బంటుమిల్లి ఇన్చార్జి తహసిల్దార్ కాగిత పూర్ణచంద్రరావు వివరణ ఇచ్చారు. ఆయన మండల పరిధిలో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!