"కార్యకర్తే అధినేత" అన్న మాటను ఆచరణలో పెట్టిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు

By Ravi
On

WhatsApp Image 2025-03-25 at 6.41.24 PMపాతపట్నం: తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలే పార్టీ బలంగా ఎదగడానికిచేతకారిగా ఉన్నారు. ఈ సందర్బంగా, శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు 'కార్యకర్తే అధినేత' అన్న మాటను ఆచరణలో పెట్టారు.

అతని కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన 'కార్యకర్తే అధినేత' సమావేశంలో ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ, "తెలుగుదేశం పార్టీకి దేశంలో ఎటువంటి పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం ఉంది. ఇటీవలి కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చరిత్ర సృష్టించి, ఈ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద కుటుంబంగా మారింది" అని అన్నారు.

"ప్రతి బుధవారం నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తా" అని ఆయన తెలిపారు.

అలాగే, "పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు తమ కష్టాలను అధిగమించి పార్టీకి బలం ఇచ్చారు. వారి పాత్రపై ఇంకా అభినందనలు తెలియజేస్తూ, ఇటీవల చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సానుకూలంగా పనిచేసిన నాయకులను సన్మానిస్తాం" అని చెప్పారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..! జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్షనే ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులకు...
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం..!
సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..!
పిఠాపురంలోనే ఎందుకిలా..?
భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య
స్నేహితుల చేతిలో హత్యకు గురైన యువకుడు
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్