హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్

By Ravi
On
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్

తెలుగు క్రికెటర్ హనుమ విహారి రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్‌ రూల్స్‌ లో మార్పులు చేయాంటూ ఆ పోస్ట్ లో వివరించారు. వాంఖడే వేదికగా ముంబయి టీమ్, బెంగళూరు టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగుళూర్ విన్ అయిన సంగతి తెలిసిందే. అయితే మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కోహ్లీ 67, పటీదార్ 64, జితేశ్ శర్మ 40 నాటౌట్ గా నిలిచారు. అలాగే పడిక్కల్ 37 పరుగులు సాధించారు. 150లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను రజత్‌తో కలిసి జితేశ్‌ నడిపించారు. కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ను ముంబయి బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు. 

ఈ ఓవర్‌లో జితేశ్ ఐదో బంతికి సిక్స్‌ కొట్టాడు. ఎల్బీ కోసం అప్పీలు చేసినా.. అంపైర్‌ ఔట్‌ అంటూ అనౌన్స్ చేశారు. ఆ వెంటనే బ్యాటర్లు పరుగు తీశారు. డీఆర్‌ఎస్‌ తీసుకోగా.. రివ్యూలో నాటౌట్‌ గా తెలిసింది. అయితే, అప్పటికే బంతి డెడ్‌బాల్‌ గా అనౌన్స్ చేశారు. రన్ తీసినా దానిని కౌంట్ చేయలేదు. ఒకవేళ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చి ఉంటే అప్పుడు పరుగును లెక్కలోకి తీసుకొనేవారు. ఇప్పుడీ మ్యాచ్‌లో ఎఫెక్ట్ చూపించలేదు. అదే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమైనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురై ఉంటే ఏం చేసేవారని, సో ఈ రూల్స్ లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ విహారీ పోస్ట్ ను షేర్ చేశారు.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..