న్నవరం రైతులకు 227 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

By Ravi
On
న్నవరం రైతులకు 227 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

WhatsApp Image 2025-03-24 at 6.36.31 PMగన్నవరం:
గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన 99 మంది రైతులకు విజయవాడలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో 227 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 147 నివాస ప్లాట్లు మరియు 80 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి.

ఈ-లాటరీ ప్రక్రియలో రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ముందుగా ట్రైల్ రన్ వేసి, అనంతరం ప్రత్యక్ష లాటరీ నిర్వహించారు. లాటరీ ప్రక్రియలో విజేతలు తమ ప్లాట్లను సొంతంగా పొందారు.

రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు గుడివాడ రెవిన్యూ డివిజన్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, సిఆర్డిఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ల్యాండ్ అక్వైజేషన్) NSVB వసంతరాయడు, ల్యాండ్స్ విభాగం అధికారి తెలిపారు.

ప్లాట్ల భౌగోళిక కేటాయింపుని వివరించేందుకు ప్రత్యేకంగా జి.ఐ.ఎస్. సిబ్బంది మరియు గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రైతులకు సూచించారు.

Tags:

Advertisement

Latest News

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం..! ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం..!
సికింద్రాబాద్ నుంచి హౌరా వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. రైలు పలాస రైల్వేస్టేషన్ దాటిన వెంటనే సుమ్మదేవి రైల్వేస్టేషన్ సమీపంలో బోగీల మధ్య...
సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..!
పిఠాపురంలోనే ఎందుకిలా..?
భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య
స్నేహితుల చేతిలో హత్యకు గురైన యువకుడు
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే