శ్రీకాకుళం పట్టణం కంపోస్టు కాలనీ అభివృద్ధి పై శాసనసభలో చర్చ

By Ravi
On
శ్రీకాకుళం పట్టణం కంపోస్టు కాలనీ అభివృద్ధి పై శాసనసభలో చర్చ

  • శ్రీకాకుళం కంపోస్ట్ కాలనీలో ఉన్న 200 ఇల్లను రెగ్యులర్ చేయాలి అన్న ఎమ్మెల్యే గోండు శంకర్.
  •  సుమారు 1500 కుటుంబాల ప్రజలు ఈ కంపోస్ట్ కాలనిలో నివాస్తున్నారు.

TPN Srikakulam Rajasekhar 

Date 20/03/25

 శ్రీకాకుళం పట్టణంలో 1976 సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు 50 సంవత్సరాలు తర్వాత ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని, 1998 లో సీసీ రోడ్డు నిర్మాణం జరిగిందని గురువారం శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. పట్టణంలో సుమారు 1500 కుటుంబాలు ఎలక్ట్రికల్, ఇంటి పన్నులు కడుతున్నారని వారికి రెగ్యులర్ చేయాలని తెలిపారు. కంపోస్ట్ కాలనీలో 200 కుటుంబాలు ఉన్నాయని వారికి రెగ్యులర్ చేయాలని, 345,46,48,55,56,358/1 లో మున్సిపల్ రికార్డుల్లో గోర్జు దారిగా ఉందని , దాని రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ 30, తారీకు 29-01-2025 ప్రకారం రెగ్యులర్ చేయాలని తెలిపారు. ఎలక్ట్రిఫికేషన్, మున్సిపల్ ఇంటి పన్నులు, రెగ్యులర్గా కడుతున్నారని, వారి యొక్క నివాస స్థలాలు రెగ్యులర్ చేస్తే 1500 కుటుంబాలుకు మేలు జరుగుతుందని శంకర్ తెలిపారు. శాసనసభ సమయం వృధా చేయకుండా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సభ ముందు ఉంచినందుకు శంకర్ కు స్పీకర్ అభినందించారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..