అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్లో బాధితుల ఆందోళన
హైదరాబాద్, ఏప్రిల్ 10: అక్షర చిట్ ఫండ్ మోసాలకు సంబంధించి తీవ్ర అసంతృప్తితో బాధితులు బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. అధిక వడ్డీల ఆశ చూపి వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన చిట్ ఫండ్ చైర్మన్ శ్రీనివాస్, అతని భార్య శ్రీ విద్యపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితుల వివరాల ప్రకారం, సుమారు 10 వేల మందిలో నుండి రూ.1000 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు కూనంనేని సంపత్, ఎమ్మెల్యే సాంబశివరావు బాధితులకు మద్దతు తెలిపారు. "కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల పేరుతో ప్రజలను మోసం చేయడం మేము సహించం," అని సీపీఐ నేతలు స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి బాధితుల డిమాండ్లు:
-
చిట్ ఫండ్ మోసాలపై గట్టిగా చర్యలు తీసుకోవాలి
-
బినామీ పేర్లతో నడుస్తున్న చిట్ ఫండ్ సంస్థలపై విచారణ జరిపించాలి
-
శ్రీనివాస్, శ్రీ విద్య ఆస్తులన్నీ జప్తు చేయాలి
-
ఉపా చట్టం మాదిరిగా కఠిన శిక్షలు విధించాలి
-
చిట్ ఫండ్ల నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి
-
అనుమతులపై నిఘా పెంచేలా చట్టాలను బలోపేతం చేయాలి
ఈ తరహా మోసాలతో పేద ప్రజల శ్రమపెట్టుబడులు మోసగాళ్ల వద్దకు వెళ్లిపోతున్నాయని, ప్రభుత్వ తక్షణ జోక్యం అవసరమని వారు హెచ్చరించారు.