పలుచోట్ల ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్..గంజాయి.. ఓజి కుష్ ఆయిల్ స్వాధీనం

On
పలుచోట్ల ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్..గంజాయి.. ఓజి కుష్ ఆయిల్ స్వాధీనం

హైదరాబాద్: కాప్రా పద్మాశాలీ టౌన్‌షిప్‌లో డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టి ఎఫ్బీ ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. కారులో డ్రగ్స్‌ రవాణా జరుగుతున్నాయనే ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించగా 3.20 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌, 12.34   గ్రాముల ఓజీ కుష్‌ పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. కారులో ఉన్న యోగేష్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని విచారించగా ఆర్‌కే పురానికి చెందిన అశ్విన్‌ నుంచి తీసుకువచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుపడంతో ఆతడిపై కూడ కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌తోపాటు కారును ఘట్కేసర్ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించ మాన్నారు.
రెండు కేసుల్లో గంజాయి పట్టివేత..
అమీర్‌పేట్‌ పరనిధిలోని యూసఫ్ గూడ మెట్రో స్టేషన్‌ సమీపంలో గంజాయి  అమ్మకాలు జరుపుతున్న వారి వద్ద నుంచి ఎస్టి ఎఫ్డీ టీమ్‌ ఎస్సై జ్యోతి సిబ్బంది   కలిసి దాడులు నిర్వహించి 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో  రాజేష్‌ నాయక్‌ అరెస్టు చేశారు. మోద్‌ సునీల్‌ పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. 
ఇదే టీమ్‌ మరో కేసులో పటాన్‌ చెరువు ప్రాంతంలో ఇద్దరి వద్ద నుంచి 1.15 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకుని చీటుకుల సాయి కిరణ్‌, మహేష్‌లను అరెస్టు చేశారు.IMG-20250616-WA0039

Advertisement

Latest News