భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ అభివృద్ధికి జిల్లా పోలీసుల పునాదులు

On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ అభివృద్ధికి జిల్లా పోలీసుల పునాదులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూన్ 11 2025:


మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరో ముందడుగు వేసారు. చర్ల మండలంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 20 మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు మినీ రైస్ మిల్లులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ మాట్లాడుతూ, "మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, రవాణా తదితరాలన్నీ ఆదివాసీ గ్రామాలకు అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది. మినీ రైస్ మిల్లుల ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి" అన్నారు.

ప్రతి గ్రామానికి రూ.2,50,000 విలువైన మినీ రైస్ మిల్ యూనిట్లు 20 గ్రామాలకు అందించబడ్డాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సెయిలింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో పాల్గొన్న రాళ్లపురం గ్రామానికి చెందిన ఆడమయ్యను ఎస్పీ గారు ఘనంగా సన్మానించారు. అలాగే నిషేధిత మావోయిస్టు కార్యకర్త పొడియం లక్ష్మి కుటుంబాన్ని కలుసుకుని వారికి సహాయం అందించారు.

మావోయిస్టు పార్టీలో ఉన్నవారు లొంగిపోయి సామాన్య జీవితంలో చేరాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

Advertisement

Latest News

స్పెషల్ హెల్ప్ లైన్ వారి కోసమే.. అధికారులు.. వారి నంబర్లు ఇవే స్పెషల్ హెల్ప్ లైన్ వారి కోసమే.. అధికారులు.. వారి నంబర్లు ఇవే
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న భారతీయులను కాపాడేందుకు ప్రభుత్వం...
సినీనటి రమ్యశ్రీ.. ఆమె సోదరుడిపై హత్యాయత్నం.
వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ జితేందర్ రివ్యూ
పిల్లల రక్షణకై సిటీ కమిషనరేట్ లో కీలక అడుగు
శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం
డయల్ 112కి కాల్.. హైదరాబాద్ లో తప్పిన భారీ ముప్పు
మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు