భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!

On
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!

బస్ పాస్ ధరలను భారీగా పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం  తెలిపింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా  పెంచినట్లు వెల్లడించింది. 
ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్పాస్ ధరను రూ.1450 నుండి రూ 1800 కు పెంచినట్లు ఆర్టీసీ పేర్కొంది.  పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ యజమాన్యం. ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని జనం మండిపడుతున్నారు. ఓపక్కన ఉచితం అంటూ వడ్డన మరిపక్కన నడ్డివిరిచే పని చేయడం సమంజసం కాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest News

ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్.. ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్..
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్. ...
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు