ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

On
ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సాక్షి ఛానెల్‌లో జరిగిన ఒక డిబేట్‌లో మహిళలపై చేయబడ్డ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన కూటమి పార్టీల మహిళా నేతలు, రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. వారు సాక్షి బోర్డు పీకేసి, కోడిగుడ్లను విసిరి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు అడ్డుకున్నారు. సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన కొనసాగుతోంది. "సాక్షి ని అడ్డం పెట్టుకుని నీచంగా మాట్లాడతారా? రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలపై నోరు పారేసుకుంటారా?" అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సాక్షి యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, డిబేట్‌లో పాల్గొన్న ఇద్దరినీ శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ మొత్తం ఘటనపై భారతీ రెడ్డి ఇప్పటికీ స్పందించకపోవడంపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తూ, ఆమె కూడా అదే కోవకే చెందిందా అంటూ ప్రశ్నించారు. 

Advertisement

Latest News

ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్.. ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్..
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్. ...
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు