వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్

On
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల: 09-06-2025

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి మహిళకు అవమానం జరిగినందుకు వైసిపి పార్టీ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంత మహిళలనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా మహిళలను వైసిపి నాయకులు, అనుచరులు అసభ్యంగా విమర్శించారని ఆరోపించారు.

సాక్షి ఛానల్‌లో మహిళలను లాఘవంగా వ్యాఖ్యానించిన కృష్ణంరాజు, ఆ కార్యక్రమం నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే అరెస్ట్ చేయాలని, సాక్షి ఛానల్ యాజమాన్యం భారతి రెడ్డి మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, ఎచ్చెర్లలోని సాక్షి పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపు మేరకు పార్లమెంట్, నియోజకవర్గం తెలుగు మహిళా నేతలు మెట్ట సుజాత, గొండు స్వాతిశంకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ధర్నాలో కొంత ఉద్రిక్తత నెలకొంది.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తెలుగు మహిళా బృందం, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై నిన్న శ్రీకాకుళం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Latest News

ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్.. ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్..
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్. ...
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు