ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్..10మందికి గాయాలు..
By V KRISHNA
On
రంగారెడ్డిజిల్లా: కందుకూరు శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బైక్ పై వెళుతున్న వ్యక్తిని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి 11కెవి విద్యుత్ స్తంభాని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్ ఫార్మర్ జంపర్ పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 25మంది ప్రయాణికులు ఉన్నారు. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కందుకూర్ పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Tags: #tgrtc#ipssajjanar#
Latest News
09 Jun 2025 18:37:14
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం
మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు
అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్.
...