నగరానికి వచ్చిన ప్రభాకర్ రావు.. ఎయిర్ పోర్ట్ లో భారీ స్కెచ్..

On
నగరానికి వచ్చిన ప్రభాకర్ రావు.. ఎయిర్ పోర్ట్ లో భారీ స్కెచ్..

  • 70 మంది బౌన్సర్లను దింపిన కుటుంబ సభ్యులు
  • మీడియా ప్రతినిధులపై దాడి.. ప్రభాకర్ రావు ఇంటి వరకు బౌన్సర్లతో సెక్యూరిటీ..
  • దాడిలో గాయపడ్డ పలువురు మీడియా ప్రతినిధులు

మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదురుకొంటున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు చేరుకున్నారు. శంషాబాద్ నుండి నేరుగా తన ఇంటికి చేరుకున్న ప్రభాకర్ రావు 10గంటల ప్రాంతంలో సిట్ ఎదుట విచారణకు హాజరవుతారు. ఇక మీడియా నుండి తప్పించుకునేందుకు ప్రభాకర్ రావు కుటుంబ పెద్ద స్కెచ్ వేశారు. ఎయిర్పోర్టులో ప్రభాకర్ రావు కోసం 70మంది  బౌన్సర్లను దింపారు. కొందరు సివిల్ డ్రస్ లో మరికొందరు డ్రస్ కోడ్ పాటించారు. పక్కా ప్లాన్ ప్రకారం ప్రభాకర్ రావుకు అడ్డంగా నిలడ్డారు. ఆయన రాకను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఎల్బోలతో బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రిపోర్టర్ రవితో పాటు మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.  బౌన్సర్లని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించిన ఎల్బోలతో దాడికి పాల్పడుతూనే ఉన్నారు. మరోపక్కన పోలీసులు ఉన్న బౌన్సర్లు దాడి చేస్తున్న చూసి చూడనట్లు వ్యవహరించారని తెలిపారు. ఒక్కసారిగా 70 మంది బౌన్సర్లు దాడికి పాల్పడటంతో ఎయిర్ పోర్ట్ లో మిగతా ప్రయాణికులు వారి బంధువులు భయంతో వణికి పోయి పరుగులు తీశారు. ఎయిర్ పోర్ట్ నుండి  ప్రభాకర్ రావు ఇంటి వరకు బౌన్సర్లతో కాన్వాయ్ కొనసాగింది. ఆయనను ఇంట్లో దింపిన తర్వాత తిరిగి వెళ్లి పోయారు. ప్లాన్ ప్రకారమే మీడియాపై దాడి చేసి అక్కడి నుండి వెళ్లిపోయారని తెలుస్తోంది. బౌన్సర్ల దాడిపై మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. అచ్చం ఎయిర్ పోర్ట్ తరహాలోనే సిట్ వద్ద కూడా మఫ్టీలో  మీడియాను అడ్డుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Latest News

ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు.. ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
మేడ్చల్ జిల్లా : ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన లభించింది. అధికారుల్లో చలనం కలిగించింది.  దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లి 14 వ వార్డులో...
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో పిజీ విద్యార్థుల ధర్నా..
సిట్ ఎదుట విచారణకు హాజరైన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు..