దంపతుల గొడవ మధ్యలో సర్ది చెప్పేందుకు వెళ్లింది...
By V KRISHNA
On
రంగారెడ్డి: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. జుబేదా బేగం అనే మహిళను సలీం అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. ఘర్షణ పడుతున్న భార్యాభర్తలకు సర్దిచెప్పేందుకు వెళ్లిన జుబేదాను మాకే నీతులు చెబుతావా అంటూ కోపోద్రిక్తుడైన సలీం ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన జుబేదాను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
07 Jun 2025 20:14:15
తిరుచానూరు, జూన్ 7:శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుచానూరులో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ...