ఒప్పంద ఉద్యోగిని పెత్తనం

On
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం

- అవినీతి ఆరోపణలలో మహిళాభివృద్ధి శాఖ
- అర్హతలేని వారికి పోస్టింగ్ కోసం అర్హులపై బురద
- ఏళ్లుతరబడి ఒకే చోట తిష్ఠ -  సహా ఉద్యోగులపై అహంకారం

ఏలూరు 
ఆమెఓ ఒప్పంద ఉద్యోగి ... అయితేనేం.. ఆమె చెప్పినట్లే ఆ శాఖ ఉన్నతాధికారులతో సహా అందరూ వినాల్సిందే. లేదంటే వారిపై ఫిర్యాదులు చేయడం  చేయడం ఆమె నైజం. ఆ ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించేట్లు వ్యవహరిస్తోంది. 


వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఒక ఒప్పంద ఉద్యోగిని 2011 జూన్‌లో ఉద్యోగం సంపాదించింది. ఆ నియామకం సమయంలోనే  అక్రమ మార్గంలో ఉద్యోగం తెచ్చుకున్నదనే ఆరోపణలున్నాయి.   నియామక సమయంలో కమిటీ సభ్యులు వేసిన మార్కుల వివరాలను నిశితంగా పరిశీలిస్తే.. ఈమె ఏ రకంగా ఈ జిల్లాలో సంబంధిత ఉద్యోగానికి అర్హత సాధించిందో అప్పట్లోనే వార్తలు వెల్లువెత్తాయి.  సదరు కార్యాలయానికి చెల్లించే నెలసరి అద్దెలో సుమారు 25శాతం బిల్డింగ్ యజమాని దగ్గర నుంచి ఆమె చేతికి చేరాలి. ఈ ఆఫిస్  ఇప్పటికీ ఐదారు చోట్లకు మారింది. గతంలో ఎన్ ఆర్ పేట్ మోర్ సందులో ఈ  కార్యాలయం ఉండేది.  ప్రభుత్వం నుంచి రెంట్ చెల్లించిన తదుపరి రోజు నుండి ఆ బిల్డింగ్ యజమాని కి తన వాటా  25శాతం ఇవ్వాలని కోరింది. కానీ ఆ యజమాని అందుబాటులో లేకపోవడంతో తిరిగి వచ్చి ఇస్తాను అని చెప్పినా  తనకి పదే పదే ఫోన్ చేసి విసిగించి ఎట్టకేలకు తనకు  రావలసినటువంటి వాటాను తీసుకుంది.   మరో విషయం ఏమంటే గతంలో శిశు గృహ అద్దె బిల్డింగ్ లో ఉండేది. గత కలెక్టర్   విద్యానగర్లో ఒక ప్రభుత్వ భవనంలో ఈ శిశు గృహాన్ని కొనసాగించమని ఆదేశించారు. ఈ శిశు గృహ మరమ్మత్తులు చేయడం కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న సొమ్ము  సక్రమంగా వినియోగించ కుండా ఈ ఒప్పంద ఉద్యోగి తన జేబు నింపుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రభుత్వ భవనాన్ని   ఒప్పంద ఉద్యోగి తీసుకునే సమయానికి ఆ బిల్డింగ్ లో ప్రభుత్వానికి సంబంధించి ఫర్నిచర్ రెండు పెద్ద ఎల్సీడీ టివిలు ఉన్నాయి. అవి తిరిగి ఇవ్వకుండా తనే స్వాహా చేసి తన దగ్గరే పెట్టుకుందని సమాచారం  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాల్లో బాలబాలలకు సంబంధించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ఆధారంగా చేసుకుని ఈ ఒప్పంద ఉద్యోగిని ఫ్లెక్సీల రూపంలో.. లిటరేచర్ రూపంలో తయారు చేయించానని, అవగాహన సదస్సులు పెట్టానని లక్షలాది రూపాయలు తన చేబులోకి నింపుకుందని సమాచారం. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం సక్రమంగా అమలవుతుందో లేదో పరిశీలించడానికి ఒక కార్య చరణ ప్రణాళికతో..  స్కానింగ్ సెంటర్స్ సక్రమంగా పనిచేస్తున్న లేదని తెలుసుకోవాలని జిల్లా అధికారులు ఈ ఒప్పంద ఉద్యోగికి బాధ్యతలు అప్పగించారు. దీనిలో కూడా ఈ ఒప్పంద ఉద్యోగి గర్భిణీ స్త్రీలను ఆయా స్కానింగ్ సెంటర్ లకి తీసుకెళ్లకుండా తీసుకుని వెళ్లామని. స్కానింగ్ చేయించామని, ఈ స్కానింగ్ సెంటర్ సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేశామని నివేదికలు సమర్పించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పంద ఉద్యోగి గర్భిణీలు తీసుకెళ్లినట్లు, వారికి స్కానింగ్ చేయించినట్లు, వారి ద్వారా ఈ స్కానింగ్ సెంటర్ చట్టం మేరకు పనిచేస్తుందో లేదో తెలుసుకున్నట్లు నివేదిక తయారుచేసి ఆ స్కానింగ్ సెంటర్లో ఖర్చైన వివరాలు ఎంతైతే.. అంత ప్రభుత్వ ఖజా నుండి తన జేబులోకి నింపుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఈ ఒప్పంద ఉద్యోగిని చట్టం విధి విధానాలను ఎక్కడ కూడా పాటించిన దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి.  ఉదాహరణకు ప్రభుత్వ సంస్థలలో వసతి పొందుతున్న అనాధలు కానీ.. దత్తత ప్రక్రియలో బాలల సంక్షేమ సమితి పాత్ర చాలా కీలకమైంది. కానీ ఈ ఒప్పంద ఉద్యోగి బాలల సంక్షేమం జరిగే సమయంలో మిషన్ వాత్సల్య అనే స్కీములో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని అక్కడకు పంపించాలని ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ  కనీసం వారిని పంపించదు. సరికదా ఆ బాలల సంక్షేమ సమితి సభ్యుల పైన తనకు అనుకూలమైన విధంగా నివేదికను ఇవ్వకపోతే నేరుగా గతంలో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి లేనిపోయిన మాటలు చెప్పి వారి ద్వారా ఈ కమిటీ సభ్యులను తిట్టిచ్చి శిక్షించిన సందర్భాలున్నాయి.   సదరు ఒప్పంద ఉద్యోగి నేరుగా జిల్లా స్థాయి అధికారులకు తన శాఖలో పనిచేసే తనకంటే పై అధికారులపై ఇతర శాఖల అధికారులపై కూడా పెత్తనం  చేయాలని వారి శాఖలలో జరుగుతున్నటు వంటి లోపాలని తన శాఖ అధికారులు దృష్టికి కాకుండా తన పరిధిని మించి తన స్థాయిని మించి నేరుగా జిల్లా స్థాయిలో ఉన్న అగ్రశేని నాయకుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆమె నైజం.

Advertisement

Latest News

మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్.. మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్..
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల
పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..