నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

On
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు మండలంలోని రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేడు ప్రారంభించారు. రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో, PACS చైర్మన్ గాయత్రి పాండు పర్యవేక్షణలో ఈ దుకాణ సముదాయం నిర్మించబడింది. వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ నూతన సముదాయాన్ని నిర్మించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక ప్రజలకు ఈ దుకాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు హరిశంకర్ గౌడ్,రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నె రాజు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.IMG-20250607-WA0091

Advertisement

Latest News

మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్.. మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్..
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల
పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..