నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు మండలంలోని రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేడు ప్రారంభించారు. రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో, PACS చైర్మన్ గాయత్రి పాండు పర్యవేక్షణలో ఈ దుకాణ సముదాయం నిర్మించబడింది. వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ నూతన సముదాయాన్ని నిర్మించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక ప్రజలకు ఈ దుకాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు హరిశంకర్ గౌడ్,రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నె రాజు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.