ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రారంభం..

On
ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రారంభం..

  • చేపప్రసాదానికి సిద్ధమైన ఎగ్జిబిషన్ గ్రౌండ్..
    లక్షల్లో చేరుకున్న ఆస్తమా వ్యాధిగ్రస్తులు..
    దేశ విదేశాల నుండి వచ్చిన అతిధులు..
    ఈసారి అదనంగా పది ప్రత్యేక కౌంటర్లు..
    ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రసాదం పంపిణీ షురూ..

By. V. Krishna Kumar
Tpn: స్పెషల్ డెస్క్..
మృగశిర కార్తె వచ్చింది అంటే చాలు హైదరాబాద్ లో గుర్తుకు వచ్చేది చేపప్రసాదం. ప్రసాదం పంపిణీకి ఈసారి అదిరిపోయే స్థాయిలో ఏర్పాట్లు రెడీ అయ్యాయి. బత్తిని బ్రదర్స్ వేసే మందు కోసం దేశ..విదేశాల నుండి పెద్దఎత్తున ఆస్తమా వ్యా20250607_114949ధి గ్రస్తులు సిటీకి చేరుకున్నారు. లక్షల్లో వచ్చే జనం కోసం ఈ సారి పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధమైనాయి.

మృగశిరకార్తె సమీపించగానే బత్తిని సోదరులు వేసే చేప ప్రసాదం గుర్తుకువస్తుంది. ఈ ప్రసాదం కోసం రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి పెద్దఎత్తున జనం హైదరాబాద్ కు చేరుకుంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రసాదం పంపిణీ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూడా తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధమైనారు.
మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ అధికారులతో పాటు పలుప్రభుత్వ అధికారులు పనుల్లో నిమగ్నమైనారు. పంజాబ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, పాట్నా, కలకత్తా ఇలా ఇతర ప్రాంతాల నుండి పెద్దఎత్తున జనం వారం రోజుల ముందే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నారు. ఆదివారం నుండి గ్రౌండ్ లో చేపప్రసాదం పంపణీ జరగుతుంది. గత ఏడాది దాదాపు రెండు లక్షల మంది జనం ఈ ప్రసాదం కోసం రావడం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ సారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతి యేటా రెండు రోజులముందు జనం వస్తే ఈ సారి వారం పది రోజులముందే వచ్చారని అధికారులు చెబుతున్నారు.
లక్షల్లో వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గత ఏడాది కంటే ఈ సారి పది కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేశారు. దీని వల్ల రోగులు ఎక్కువ సేపు లైన్ లో నిలబడాల్సిన అవసరం ఉండదని నిర్వాహకుల ఆలోచన.
ఇక లక్షల్లో వచ్చే జనం కోసం పోలీసు శాఖ బందోబస్తుకు సిద్ధమైంది. సిటీ పోలీసులతో పాటు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి పెద్దఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. దాదాపు రెండువేల మంది పోలీసులను ఈ సారి బందోబస్తుకి కేటాయించారు. గ్రౌండ్ లో ఉన్న మూడు ప్రదాన రహదారుల వద్ద సిసి కెమేరాలతో పాటు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే జనాలను మోసం చేసే దళారీలపై ఈ సారిప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే గ్రౌండ్ మొత్తం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సాధారణ జనాలతో పాటుగా, విఐపీల కోసం ప్రత్యేకస్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికోసం ఆర్టీసి అధికారులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ప్రత్యేక బస్సులను సైతం నడుపుతున్నారు. అలాగే మత్యశాఖ లక్షల్లో చేపపిల్లను సిద్ధం చేసింది.

 

Advertisement

Latest News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
తిరుచానూరు, జూన్ 7:శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుచానూరులో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ...
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల
పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్..