పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
By V KRISHNA
On
దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నాచారంలోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మా రెడ్డి భారతీయ జనతా పార్టీకి పాత కార్యకర్త, నేను పార్లమెంటు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన సందర్భంలో కన్వీనర్ గా ఉండి పార్టీ కోసం పనిచేసిన గొప్ప నాయకుడు, నాకు చాలా ఆప్తుడు, పద్మా రెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటు అని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
07 Jun 2025 22:11:00
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...