పిస్తా హౌస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..

By Ravi
On
పిస్తా హౌస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్‌లోని పిస్తా హౌస్ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. హోటల్‌లోని సిబ్బంది, కస్టమర్లు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. IMG-20250606-WA0100షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Latest News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
తిరుచానూరు, జూన్ 7:శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుచానూరులో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ...
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల
పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్..