పిస్తా హౌస్ హోటల్లో అగ్ని ప్రమాదం..
By Ravi
On
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని పిస్తా హౌస్ హోటల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. హోటల్లోని సిబ్బంది, కస్టమర్లు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags: #pisthousehotel#
Related Posts
Latest News
07 Jun 2025 20:14:15
తిరుచానూరు, జూన్ 7:శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుచానూరులో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ...