బొల్లారంలో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం..
By Ravi
On
సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడ ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తీలో గల హెచ్డిఎఫ్సి ఏటీఎంలో తెల్లవారుజామున చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు ఏటీఎం మిషన్ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. అయితే ఏటీఎం మిషన్ను పగలగొడుతుండగా అలారం మోగడంతో దొంగలు వెంటనే అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనలో ఎటువంటి నగదు పోలేదని పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఐడిఎ బొల్లారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐడిఎ బొల్లారం పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకోవడానికి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Related Posts
Latest News
04 Jun 2025 21:54:12
హైదరాబాద్: కూకట్ పల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు ఏపీ పోలీసులను అరెస్ట్ చేశారు. తిరుపతిలో టాస్క్...