బొల్లారంలో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం..

By Ravi
On
బొల్లారంలో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం..

సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడ ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తీలో గల హెచ్‌డిఎఫ్‌సి ఏటీఎంలో తెల్లవారుజామున చోరీకి విఫలయత్నం జరిగింది.  మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు ఏటీఎం మిషన్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. అయితే ఏటీఎం మిషన్‌ను పగలగొడుతుండగా అలారం మోగడంతో దొంగలు వెంటనే అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనలో ఎటువంటి నగదు IMG-20250603-WA0020పోలేదని పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఐడిఎ బొల్లారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐడిఎ బొల్లారం పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకోవడానికి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

Advertisement

Latest News