పెంగ్విన్ కేసును ఈఓడబ్ల్యుకి బదిలీ చేసిన పోలీసులు..
మేడ్చల్ జిల్లా:జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన పెట్టుబడులతో మోసం చేసిన కేసును ఈఓడబ్ల్యూ కి బదిలీ చేశారు. చింతల్ సూర్యనగర్లో పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ నిర్వహకులు స్వాతి, బాలజీలు పెట్టుబడుల పేరుతో రూ. 100 కోట్లకు వరకు వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. గత నెల 30న సంతోష్ అనే వ్యక్తి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల అదుపులో ఉన్న స్వాతిని విచారించగా, పరారి లో ఉన్న బాలాజీ కోసం గాలింపులు ముమ్మరం చేశారు. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో మోసాలకు పాల్పడిన నిందితులకు సంబంధించిన 12 బ్యాంక్ అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. మోసపోయిన బాధితులు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో కేసు ను సవాల్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆర్థిక నేరం ఎక్కువగా ఉండటంతో కేసును ఈఓడబ్ల్యుకి బదిలీ చేశారు.