బడంగిపేటలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
రంగా రెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామ్ రెడ్డి ఆధ్వర్యం లో పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు,మాజీ కార్పొరేటర్ల తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణను సాధించిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని తెలిపారు.ఎందరో అమరుల త్యాగఫలమే నేడు తెలంగాణ అని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనలో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని రామ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనుకబడిపోయిందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడగోట్టి,మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని రామిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలను ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రజలు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.