కేసీఆర్.. పవన్ కళ్యాణ్ పై మండిపడిన సిపిఐ నారాయణ..

By Ravi
On
కేసీఆర్.. పవన్ కళ్యాణ్ పై మండిపడిన సిపిఐ నారాయణ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ లో ఇస్క ఫ్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ  కార్యదర్శులు నారాయణ, అజిజ్ పాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ  కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా టిఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీగా చేసుకుని రాష్ట్రం సాధించారని కేసీఆర్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణ  ప్రజలు,  రాజకీయ పార్టీలు సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేసీఆర్ మరిచిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే టిఆర్ఎస్ పార్టీని రాజకీయ పార్టీగా   చేసుకొని సాధారణ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చినందుకు తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సమస్యలతో ఉన్నారని  ఆయన కూతురు కవిత రాసిన లేఖ నే నిదర్శనం అని ఆయన తెలిపారు. సనాతన ధర్మం గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. సనాతన ధర్మం అంటే పెళ్లయిన భార్య భర్త తోపాటు ఉండాలని భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టిన భరించేవారని ఆ కాలంలో విడాకుల ప్రస్తావనే ఉండేది కాదని భర్త చనిపోతే చితి మీద భార్యను కూర్చోబెట్టి భార్యను కూడా తగలబెట్టే వాళ్ళని అది సరైన సనాతన ధర్మం అని ఆయన అన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి సనాతన ధర్మం మారిపోయిందని ముగ్గురు భార్యలను చేసుకున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతి హక్కు లేదని మొదటగా సనాతన ధర్మం గురించి చెప్పేవాడిని జైల్లో వేయాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాల్, జోజి, బిక్షపతి గౌడ్, మురళి, సిపిఐ నాయకులు, మహిళా నాయకురాలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Latest News