నల్గొండ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ మల్లింపు.. కారణం ఇదే..
By Ravi
On
మలక్ పేట నల్గొండ ఎక్స్ రోడ్డులో అధికారులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. శుక్రవారం నుండి అక్బర్ బాగ్ నుండి ప్రధాన రోడ్లపై విఫరీతంగా పారుతున్న మురుగు నీరు సమస్యతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలియగానే పరి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్,
జలమండలి ఈడీ మయాoక్ మిట్టల్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దిల్ షుఖ్ నగర్, కోఠి నుండి నల్గొండ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలను మళ్లింపులో చేపట్టారు. వాన దారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానం చేరుకొని తమకు సహకరించాలని అధికారులు కోరారు. వీలైనంత త్వరలో సమస్యకు పరిష్కారం చేపడతామని తెలియజేశారు.
Related Posts
Latest News
01 Jun 2025 21:37:44
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా...