ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తే.. ఇలాగేనా మాట్లాడేది..
- గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై ముదురుతున్న వివాదం
- అగ్నిమాపక శాఖపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మోడీ కుటుంబ సభ్యులు
- ఆరోపణలు సరికాదంటున్న శాఖ అధికారులు
- తమ సిబ్బంది పని మెచ్చుకోక పోయిన పర్వాలేదు.. తప్పులు ఎత్తి చూపడం ఏంటి అని ప్రశ్న
By.. V.Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలను అగ్నిమాపక శాఖ అధికారులు ఖండించారు. పొగడ్తలు మాకు అవసరం లేదు ఇలాగేనా ఆరోపణలు చేసేది అని మండిపడుతున్నారు. ప్రమాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ పైన అగ్నిమాపక శాఖ, మోడీ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
..కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు ..
* ఫైర్ ఇంజన్ లేటుగా వచ్చింది
* ఫైర్ ఇంజన్లో వాటర్ లేవు
* టార్చ్ లైట్ మాస్క్ ఆక్సిజన్ లేవు
* ఫైర్ సిబ్బంది నిచ్చెన ఎక్కలేక ఇబ్బంది పడ్డారు
* లోపలికి వెళ్లేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించలేదు
* మా కుటుంబ సభ్యులను కాపాడింది స్థానికులు మాత్రమే అగ్నిమాపక శాఖ సిబ్బంది కాదు
* ఫైర్ ఇంజన్ లోను లీకేజీలు ఉన్నాయి
* ఘటన జరిగిన తర్వాత రెస్క్ ఆపరేషన్ ను ప్రారంభించారు.
*కుటుంబ సభ్యుల ఆరోపణలకు ఫైర్ డిపార్ట్మెంట్ కౌంటర్*
* అగ్ని ప్రమాదం కాల్ వచ్చిన మూడు నిమిషాలలో స్పాట్ కు ఫైర్ ఇంజన్ వచ్చింది
* ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు అన్నది అవాస్తవం. 4500 లీటర్ల కెపాసిటీ వాటర్ టెండర్లు ఉన్నాయి
* అగ్ని ప్రమాదం ముగిసిన ఘటన తర్వాత సమీప వాటర్ హౌస్ దగ్గరికి వెళ్లి ట్యాంకును ఫిల్ చేస్తారు.
* ప్రమాదం జరిగిన వెంటనే నేరుగా అగ్నిలోకి దూకి సిబ్బంది కాపాడలేరు.. మంటలను అదుపు చేసి పొగను పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చాకనే క్లియర్ విజిబిలిటీ ఉంటుంది.
* రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది ఫైర్ సిబ్బంది .. ఇలాంటి ఘటన జరిగిన సందర్భాల్లో స్థానికులు కూడా సహాయక చర్యలో పాల్గొనడం సహజం
* ఫైర్ ఇంజన్లో ఎలాంటి లీకేజీలు లేవు.
* లోపలికి వెళ్ళేందుకు యాక్సెస్ లేకుండా నిర్మాణం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వుడ్ వర్క్ తో నిండిపోయి ఉంది. బైకులు ఇన్వర్టర్ బ్యాటరీలు పార్కింగ్ మెటీరియల్ అంతా కాలిపోయింది. వీటి ద్వారా వచ్చిన వల్ల వేడి తీవ్రత పెరిగింది.
* లోపలికి వెళ్లేందుకు మార్గం లేకపోవడం ప్రధాన సమస్య
* మొత్తం మూడు ఫ్లోర్లలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించాము.
ఇంత కష్టపడి ప్రాణాలు సైతం పణంగా పెట్టి మా సిబ్బంది పని చేస్తే ఇలాగేనా మాట్లాడేది అని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెస్పెక్ట్, సన్మానాలు మేము కోరుకోము.. మా కష్టాన్ని గుర్తించకుండా ఇలా మాట్లాడటం సరికాదన్నారు.