సిప్లాన్ ఫార్మా కంపెనీపై డిసిఏ దాడి.. భారీగా అక్రమ ఔషధాలు స్వాధీనం..
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులతో అక్రమ వ్యాపారులకు దడ పుట్టిస్తున్నారు. హైదరాబాద్ జోన్ అధికారులతో కలిసి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గాజులరామారం అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న సిఫ్లాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్-I లో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో కొంతమంది వెటర్నరీ ఔషధాలను అనధికారంగా బోలసెస్ మరియు గ్రాన్యూల్స్ను లైసెన్స్ లేకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించారు: అల్బెండజోల్ టాబ్లెట్స్ 250mg (బోలస్) వెటర్నరీ, అల్బెండజోల్ గ్రాన్యూల్స్ (వెటర్నరీ) తయారు చేసి మార్కెట్ లో విక్రయాలు జరుపుతున్నారు. ఈ అనధికార తయారీ యూనిట్లో 537 కిలోల అల్బెండజోల్ టాబ్లెట్స్ 250mg (బోలస్) వెటర్నరీ మరియు 986 కిలోల అల్బెండజోల్ గ్రాన్యూల్స్ (వెటర్నరీ) నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో అధికారులు రూ. 3 లక్షల విలువైన ఔషధాల నిల్వలును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో అధికారులు: కె. ప్రభాకర్, అసిస్టెంట్ డైరెక్టర్, కుత్బుల్లాపూర్; ఐ. శ్రీకాంత్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, గజులరామారం; కె. నవీన్ రెడ్డి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, CDSCO-హైదరాబాద్ జోన్; మరియు ఎం. విక్రమ్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, CDSCO-హైదరాబాద్ జోన్ పాల్గొన్నారు.