అక్రమంగా ఔషధాల విక్రయం.. డిసిఏ దాడి..
By Ravi
On
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారన్న సమాచారంపై స్పందించి, మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, పోలేపల్లి గ్రామంలోని వాసు క్లినిక్ పై దాడి నిర్వహించారు. దర్యాప్తులో లింగంపేట శ్రీనివాసులు అనే వ్యక్తి డ్రగ్ లైసెన్స్ లేకుండానే ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో 12 రకాల మందులను అధికారులు గుర్తించారు. వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారకాలు మరియు స్టెరాయిడ్లు ఉన్నాయని, ఈ దాడిని జడ్చర్ల డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫీ షేక్, మహబూబ్నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి. దినేష్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరిపి, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Related Posts
Latest News
29 May 2025 20:45:12
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...