విదేశీ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్

By Ravi
On
విదేశీ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్

బార్ కో.. పబ్బుకో.. స్నేహితులతో పార్టీకి వెళ్తే వేలకు వేలు ఖర్చు అవుతుందని భావించిన కొందరు ఏకంగా ఢిల్లీ గోవా ప్రాంతాలకు నుంచి ఖరీదైన మద్యం బాటిళ్లను తెప్పించుకొని జల్సాలు చేస్తుంటారు. ఎవరికైనా విదేశీ మద్యం బాటిల్ అవసరం ఉందంటే వారికి ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఖరీదైన విదేశీ మద్యం బాటిలను ఇనోవా కార్లో తరలిస్తుండగా ఓ టీమ్ ను  ఎస్టిఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది పట్టుకున్నారు. పట్టుబడిన వారి నుండి 52 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 3.60 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. బిర్లా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ఆదర్శనగర్ లో కారులో మద్యం బాటిల్లను తరలిస్తున్న సమయంలో దాడి చేసి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కుమార్ అగ్రవాల్, రోహిత్ కుమార్ లను అరెస్ట్ చేయగా, సురేనియా చంద్ర దీప్ పరారీలో ఉన్నట్లు ఎస్టిఎఫ్ టీం వెల్లడించారు.

 

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు
103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష
తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం