అసత్య ఆరోపణలు చేస్తే సహించం.. రాష్ట్ర కురుమ సంఘం

By Ravi
On
అసత్య ఆరోపణలు చేస్తే సహించం.. రాష్ట్ర కురుమ సంఘం

తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని సంఘం మీడియా కమిటీ హెచ్చరించింది. కొందరు అభివృద్ధిలో పాలుపంచుకోని వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తూ సంఘ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని విమర్శించారు. త్వరలో లీగల్ సెల్ ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని, సభ్యత్వం ఉన్నవారెవరికైనా పోటీ చేయవచ్చని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చట్టపరమైన చర్యలు తప్పవని చీర శ్రీకాంత్, కొలుపుల నరసింహలు పేర్కొన్నారు.

Tags:

Advertisement

Latest News